ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం
- అప్పుల కుప్పగా రాష్ట్రం
- మంత్రి జూపల్లి కృష్ణారావు
ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని జిల్లా ఇంచార్జి మంత్రి జూపఆల్లి కృష్ణారావు అన్నారు. కామారెడ్డి జిల్లా జక్కల్ నియోజకవర్గంలోని చారిత్రాత్మక కౌలాస్ ఖిల్లాను ఆయన సందర్శించారు. అనంతరం బిచ్కుంద మండలం ఎల్లారంలో జరిగిన ప్రజా పాలన సభలో పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని అన్నారు.పదేళ్ల పాలనలో గ్రామాలు, తండాల్లో సౌకర్యాలు లేవు, అభివృద్ధి శూన్యమని అన్నారు.ఎల్లారం తాండాకు ఇప్పటి వరకు ఎమ్మెల్యే,ఎంపీ వచ్చినా దాఖలాలు లేవన్నారు. రెవెన్యూ శివారు లేదు, గూగుల్ మ్యాప్ లో ఈ తాండా పేరే లేదని అంటున్నారని చెప్పారు. ఇదీ బీఆర్ఎస్ పాలనలో పరిస్థితి అని ఆవేదన చెందారు. ఇవ్వన్ని చూసే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారని అన్నారు.
ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా … ప్రజల వద్దకు ప్రజా పాలన తెచ్చామని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి రెండు హామీలను అమలు చేశారని అన్నారు. ఆరు గ్యారంటీల అమలుకేపీవ్ ప్రజా పాలనలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నామని అన్నారు.దశల వారీగా మిగితా హామీలను అమలు చేస్తామన్నారు. కౌలాస్ కోటను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని అన్నారు.అంతకుముందు చారిత్రాత్మక కౌలాస్ కోటను జూపల్లి కృష్ణారావు సందర్శించారు. ఎంతో ప్రసిద్ధి చెందిన కౌలాస్ కోటను అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. దీనిపై ప్రతిపాదనలు రూపొందించి, నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులను ఆదేశించారు. కౌలాస్ కోట అభివృద్ధిపై త్వరలోనే సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.మంత్రి వెంట కలెక్టర్ జితేష్ వి పాటిల్, జక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంత్ రావు తదితరులు ఉన్నారు.