ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పరామర్శించిన కేటీఆర్

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పరామర్శించిన కేటీఆర్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఇటీవల ఎమ్మేల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తండ్రి ప్రముఖ న్యాయవాది మాకునూరి హనుమంతరావు మృతి చెందగా కేటీఆర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట టీ స్కాబ్ చైర్మన్ రవీందర్రావు , జడ్పీ చైర్పర్సన్ దావసంత, మాజీ లైబ్రరీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ లు ఉన్నారు.