జిల్లా స్థాయి టాలెంట్ టెస్టులో ప్రథమ స్థానం సాధించిన కేతేపల్లి జడ్పిహెచ్ఎస్ విద్యార్థిని

జిల్లా స్థాయి టాలెంట్ టెస్టులో ప్రథమ స్థానం సాధించిన కేతేపల్లి జడ్పిహెచ్ఎస్ విద్యార్థిని

ముద్ర,పానుగల్:- సోషల్ ఫోరం ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా స్థాయిలో నిర్వహించిన సోషల్ ఫోరం టాలెంటు టెస్టులో పానుగల్ మండలం కేతేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు చెందిన 10వ తరగతి ఆంగ్ల మాధ్యమం విద్యార్థిని యశోద ప్రథమ స్థానం సాధించింది.

ఈ సందర్భంగా మండల విద్యాధికారి లక్ష్మణ్ నాయక్,ప్రధానోపాధ్యాయులు రవికుమార్, ఉపాధ్యాయ బృందం విద్యార్థిని అభినందించారు.ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థినికి బహుమతిని అందజేశారు.యశోదను ప్రేరణగా తీసుకొని మిగిలిన విద్యార్థులందరూ కష్టపడి చదవాలన్నారు.విద్యార్థులందరూ సక్రమంగా పాఠశాలకు రావాలని అప్పుడే విద్యాభ్యాసం సార్థకమవుతుందని తెలియజేశారు. అనంతరం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు శ్రీ శ్రావణ్ కుమార్ గారిని ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానం చేశారు. తమ గ్రామానికి చెందిన విద్యార్థి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం పొందినందుకు కేతేపల్లి గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.