మృత్యువులోనూ వీడని తల్లి కూతుర్ల బంధం

మృత్యువులోనూ వీడని తల్లి కూతుర్ల బంధం

 తల్లి మృతి చెందిన 24 గంటల్లోపే కూతురు మృతి

 ముద్ర ప్రతినిధి, వనపర్తి : వనపర్తి జిల్లా కడుకుంట్ల గ్రామానికి చెందిన సత్యమ్మ (80) శనివారం ఉదయం గుండెపోటుతో మృతిచెందగా తల్లి మృతిని జీర్ణించుకోలేని కూతురు అనంతలక్ష్మి (51) అదే రోజు రాత్రి 12 గంటలకు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వనపర్తి మండలం కడుకుంట గ్రామానికి చెందిన తన కుమారులు హైదరాబాదులో నివాసం ఉంటుండడంతో వారి దగ్గరికి వెళ్లి గత కొన్ని రోజులుగా నివాసం ఉంటున్నారు. శనివారం ఉదయం సత్తెమ్మ కూర్చున్న తోటే కుప్పకూలడంతో సమీపంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి చేర్చగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు.

ఆమెను స్వగ్రామమైన కడుకుంటకు తీసుకొని రాగా తల్లి మృతి విషయాన్ని తెలుసుకున్న కూతురు అనంతలక్ష్మి కడుకుంటకు చేరుకొని తల్లి శవాన్ని చూసి రోదించసాగింది అంతలోనే అస్వస్థతకు గురై పడిపోగా ఆమెను కడుకుంట్ల పిహెచ్సిసి లో ప్రాథమిక చికిత్స అనంతరం వనపర్తి లోని ఒక ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. అక్కడే వైద్యం తీసుకుంటూనే ఆమె మృతి చెందారు. తల్లి మృతి చెందిన 24 గంటల లోపే కూతురు కూడా మృతి చెందడంతో కుటుంబంలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  గట్టిదని అందుకే ఒకేరోజు ఇద్దరం మృతి చెందారని గ్రామంలో చర్చించుకుంటున్నారు.