హుజూర్నగర్ లో ఘనంగా రాజీవ్ గాంధీ 32 వ వర్ధంతి

హుజూర్నగర్ లో ఘనంగా రాజీవ్ గాంధీ 32 వ వర్ధంతి

నల్గొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తంకుమార్ రెడ్డి.

హుజూర్నగర్ ,ముద్ర:ఆదివారం హుజూర్నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజీవ్ గాంధీ 32వ వర్ధంతి కార్యక్రమానికి నల్లగొండ పార్లమెంట్ సభ్యులు నలమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ తన ఊపిరి ఉన్నంతవరకు దేశం కోసం అవిశ్రాంతంగా శ్రమించారని భారతదేశాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేశారని ముఖ్యంగా ఐటీ రంగానికి ఆనాడే పునాదులు వేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని అన్నారు. బడుగు ,బలహీన, మధ్యతరగతి , ప్రజలను ఎంతో ఆదరించారన్నారు.
 ఈ కార్యక్రమంలో రైల్వే సౌత్ సెంట్రల్ జోనల్ నెంబర్ ఎరగని నాగన్న గౌడ్,  మాజీ జెడ్ పి టి సి గల్లా వెంకటేశ్వర్లు, పీసీసీ సభ్యులు దొంగరి వెంకటేశ్వర్ ,మైనార్టీ జిల్లా అధ్యక్షులు ఎండి నిజాముద్దీన్, గొట్టిముక్కుల రాములు ,ఇట్టి మల్ల బెంజిమెన్ కౌన్సిలర్  ధనమ్మ జైలు, కోల మట్టయ్య ,చింతకాయల రాము ,జానయ్య , యోహాన్ ,ఒంటి పులి శ్రీనివాస్ ,నూకల సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.