భూసేకరణ పనులు వేగవంతం చేయాలి

భూసేకరణ పనులు వేగవంతం చేయాలి
  • జిల్లా కలెక్టర్ వెంకట్రావు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-భూసేకరణ పనులు వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు. బుధవారం సూర్యాపేట కలెక్టర్ లోని కలెక్టర్ ఛాంబర్ నందు దేవాదుల ప్రాజెక్టు-6 కాలువల కొరకు రైతుల వద్ద నుండి భూసేకరణ కోరకై రెవెన్యూ మరియు ఇరిగేషన్ అధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు, ప్యాకేజ్ -6 కెనాల్స్ భూసేకరణ కొరకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి మండలం లో గల ఐదు గ్రామాలలో తిరుమలగిరి, మాలిపురం ,నందాపురం, అనంతారం ,తొండ  గ్రామాలలో 204 ఎకరాలు భూసేకరణ కొరకు అధికారులతో చర్చించారు. భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో వీరబ్రహ్మ చారి ,ఇరిగేషన్ ఎస్సీ సుధీర్, ఈఈ ప్రవీణ్ తాసిల్దార్, రమణారెడ్డి, కలెక్టరేట్ సూపర్డెంట్ హేమమాలిని, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.