అద్దంకి కోసం టవరెక్కిన మాల మహానాడు నాయకులు

అద్దంకి కోసం టవరెక్కిన మాల మహానాడు నాయకులు

ముద్ర ప్రతినిధి, మెదక్: అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తు మెదక్ పట్టణ మాల మహానాడు అధ్యక్షులు బత్తుల ప్రసాద్, జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జి వెంకటేష్ లు సెల్ టవర్ ఎక్కి తమ నిరసన తెలిపారు. 


కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీగా పేరు ఖరారు చేసి మరుసటి రోజు అభ్యర్థిత్వం మార్చడంపై మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టానం పునరాలోచన చేయాలనీ డిమాండ్ చేశారు.