లోలెవెల్ బ్రిడ్జి.. హైలెవెల్ కష్టాలు

లోలెవెల్ బ్రిడ్జి.. హైలెవెల్ కష్టాలు
  • అడుగడుగునా గుంతలు... తప్పని తిప్పలు
  • ప్రమాదకరంగా లోలెవెల్ వంతెన

 భూదాన్ పోచంపల్లి,ముద్ర: భూటాన్ పోచంపల్లి మండల పరిధిలోని జూలూరు-రుద్రెల్లి గ్రామాల మధ్య గల లోలెవెల్ వంతెన ప్రమాదకరంగా మారింది. వంతెనపైన అడుగడుగున గుంతలకు తోడు ఇనుప చువ్వలు తేలడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాలలో ఈ వంతెనపై ప్రయాణించాలంటే ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియని పరిస్థితి. ఇనుప చెవ్వలు తేలి ఉండడంతో ఈ వంతెనపై ప్రయాణించే ప్రయాణికుల వాహనాలు పంచర్ అయిన సంఘటనలు అనేకంగా ఉన్నాయి.

పోచంపల్లి నుండి బీబీనగర్ కు వెళ్లాలంటే ఈ దారిగుండా వెళ్లాల్సిందే. వర్షాకాల సమయంలో ఈ వంతెనపై నీరు ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. అదే సమయంలో భువనగిరికి వెళ్లాలంటే వయా పెద్దరావులపల్లి నుండి వెళ్లాల్సి వస్తుంది. ప్రస్తుతం ఈ వంతెనపై నుండి నీటిపారకం లేనందున ఈ సమయంలోనే లో లెవెల్ వంతెనపై మరమ్మతు చర్యలు చేపడితే ప్రయోజనకరంగా ఉంటుంది. గతంలో జూలూరు నుండి రుద్రేల్లి వరకు బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించి  మధ్యలోనే వదిలేశారు. అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిని పూర్తిచేయాలని వాహనదారులు కోరుతున్నారు.