ఇండ్లు, దళిత బంధు నేనే ఇస్తా

ఇండ్లు, దళిత బంధు నేనే ఇస్తా
  • ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: గృహలక్ష్మి కింద మంజూరైన ఇండ్లు, దళిత బంధు కింద ఎంపికైన లబ్ధిదారులకు నేనే చెక్కులు అందిస్తానని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి.రాజయ్య అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం ఇప్పగూడెంలో ఏర్పాటుచేసిన గణేష్ నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని విగ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ జనవరి 17, 2024 వరకు నేనే ఎమ్మెల్యేనని ఏ ప్రభుత్వ పథకమైన తానే అందిస్తానన్నారు. గిట్టని వాళ్లు, ఓర్చుకోలేని వాళ్లు ఎన్ని విమర్శలు చేసిన గణనాథుడు చూసుకుంటాడని అన్నారు. ఎమ్ ఆరు నూరైనా నియోజకవర్గానికి మంజూరైన 3 వేల ఇండ్లు, 11 వందల దళితబంధు యూనిట్లను  ఇచ్చి తిరుతా అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మారుపాక రవి, చిల్పూర్ దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, ఆకుల కుమార్, సర్పంచ్ పరశురాములు, బొంకూరి దయాకర్, బొంకూరి మహేష్, చట్ల యాకయ్య తదితరులు పాల్గొన్నారు.