ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే కవ్వంపల్లి

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే కవ్వంపల్లి

క్రీడా మైదానం కోసం చక చక ఏర్పాట్లు

హర్షం వ్యక్తం చేస్తున్న యువజన సంఘాల సభ్యులు

క్రీడా మైదానం ఏర్పాట్లను పరిశీలించిన ఎంపిపి

ఇల్లంతకుంట, ముద్ర ప్రతినిధి:  మండలకేంద్రంలో యువత క్రీడా మైదానం కోసం ఎన్నో రోజుల నుండి చేస్తున్న పోరాటం ఫలితం నెరవేరనుంది. గత ప్రభుత్వంలో ఎన్నో సార్లు క్రీడా మైదానం కోసం యువకులు అభ్యర్తించిన ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ పక్షాన మాంకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన వెంబడే యువత కోసం క్రీడా మైదానం ఏర్పాటు చేస్తానని డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మినీ గ్రౌండ్ కోసం నేడు మండలకేంద్రంలోని ఏమార్వో ఆఫీస్ పక్క స్థలంలో పనులలను ప్రారంభించడంతో మండలకేంద్రంలోని యువకులు, యువజన సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. అలాగే క్రీడా మైదానం కోసం కృషి చేసిన మండల ఎంపిపి వూట్కూరి రమణ రెడ్డి కి, యువజన సంఘాల నాయకులకు, మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నేడు క్రీడా మైదానం ఏర్పాట్లను మండల ఎంపిపి వూట్కూరి వెంకట రమణా రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు చిట్టి ప్రదీప్, యువజన సంఘాల సభ్యులు శివరాం, ఒగ్గు మధు, దీకొండ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.