నిరుపేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

నిరుపేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా : పట్టణంలోని 6వ వార్డుకు చెందిన పి.ఎర్రన్న అలివేల దంపతుల కుమార్తె పి. మహేశ్వరి గత కొన్ని రోజులుగా కిడ్నీల సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు,వారిది నిరుపేద కుటుంబం కావడంతో వారి ఆర్థిక పరిస్థితుల వల్ల మెరుగైన వైద్య చికిత్స చేయించుకోలేదు, స్థానిక నాయకులు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి దృష్టికి తేవడంతో వెంటనే ఎమ్మెల్యే స్పందించి ఆమెకు హైదరాబద్ నిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 3 లక్షల రూపాయల LOC మంజూరు చేయించి ఈరోజు అమ్మాయి తల్లిదండ్రులకు అందజేశారు, ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు పాల్గొన్నారు..