బీఅర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం..
- ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి..
- ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, వికారాబాద్:బీఅర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. తాండూరు మండలం చేంగోల్ గ్రామానికి కాంగ్రెస్ కార్యకర్తలు మంగళ వారం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో బీఅర్ఎస్ పార్టీలో చేరారు. సర్పంచ్ మల్లేశ్వరి శేకర్ గౌడ్, సీనియర్ నాయకులు వేణు గౌడ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. బీఅర్ఎస్ మానిఫెస్టో ను ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీ మోసాలను బయటపెట్టాలన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా తాండూరుకు అత్యధిక నిధులు తీసుకువచ్చిన విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు.