ఎల్లమ్మ సిద్దోగంలో పాల్గొన్న ఎమ్మెల్యే రఘునందన్ రావు

ఎల్లమ్మ సిద్దోగంలో పాల్గొన్న ఎమ్మెల్యే రఘునందన్ రావు

ముద్ర:దుబ్బాక, సిద్దిపేట జిల్లా: మిరుదొడ్డి మండలం కాసులాబాద్ గ్రామంలో  జరుగుతున్న శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి సిద్దియోగ మహోత్సవంలో దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు. మంగళవారం రోజున ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ,అనంతరం జరిగిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నరు.

ఎమ్మెల్యేను కలిసిన దుబ్బాక రేషన్ డీలర్లు
దుబ్బాక మండల రేషన్ డీలర్ల సంఘం నాయకులు మంగళవారం నాడు క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే రఘునందన్రావు కలిశారు తమ సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు మూడు నెలలుగా రేషన్ షాప్ కమిషన్లు డీలర్లకు రాలేదని వారు  రఘునందన్రావు దృష్టికి తీసుకెళ్లారు.