గోదావరిఖని లో సిసి రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

గోదావరిఖని లో సిసి రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: గోదావరిఖని-29వ డివిజన్ లో సోమవారం పట్టణ ప్రగతి నిధులు రూ. 14 లక్షలతో సిసి రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి రాజ్ ఠాకూర్ తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం ప్రాంతాన్ని పారిశ్రామిక ప్రాంతంగా మార్చేందుకు కృషి చేస్తానని, అధిక నిధులు తీసుకువచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు శ్రయ శక్తుల పని చేస్తామన్నారు.  ఈ కార్యక్రమంలో  మేయర్ అనిల్ కుమార్, మున్సిపాల్ కమిషనర్ నాగేశ్వరరావు, డివిజన్ కార్పోరేటర్ మహంకాళి స్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.