వివాహ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే శంకర్ నాయక్

వివాహ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే శంకర్ నాయక్

 గూడూరు, మే 13 (ముద్ర): మహబూబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో జరిగిన వివాహ వేడుకలకు మానుకోట ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ముందుగా గూడూరు మండలం గుండెంగా సొమ్లా తండాకు చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు బొడ బాలు కుమారుని రిసెప్షన్ కు హాజరై పట్టు వస్త్రాలు పెట్టి నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనంతరం కేసముద్రం మండల కేంద్రంలోని హరిహర గార్డెన్స్ లో కేసముద్రం స్టేషన్ ఉప సర్పంచ్ ముత్యాల నాగమణి - శివకుమార్ కూతురి వివాహానికి హాజరై పట్టు వస్త్రాలు పెట్టి నూతన వధూవరులను  ఆశీర్వదించారు.

ఎమ్మెల్యే వెంట కేసముద్రం ఎంపిపి ఓలం చంద్ర మోహన్, జెడ్పీటీసీ రావుల శ్రీనాథ్ రెడ్డి, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాదారపు సత్యనారాయణ రావు, మండల భారాస అధ్యక్షుడు మహమ్మద్ నజీర్ అహ్మద్, కార్యదర్శి కముటం శ్రీనివాస్,  స్థానిక భారాస నాయకులుఎమ్మెల్యే వెంట గూడూరు మండల పార్టీ అధ్యక్షులు వెంకట కృష్ణ రెడ్డి, ఎంపీటీసీ బొడ కిషన్, స్థానిక భారాస నాయకులు మరియు తదితరులు ఉన్నారు.