కేసీఆర్ ను పరామర్శించిన ఎమ్మెల్యే, మేయర్

కేసీఆర్ ను పరామర్శించిన ఎమ్మెల్యే, మేయర్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :హైదరాబాద్ నగరంలో ని యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్, నగరపాలక సంస్థ మేయర్ యాదగిరి సునీల్ రావు కలిసి పరామర్శించారు.  గురువారం యశోద హాస్పిటల్ వెల్లిన మాజీ మంత్రి గంగుల కమలాకర్, మేయర్ యాదగిరి సునీల్ రావు చికిత్స పొందుతున్న కేసిఆర్ ను తన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.