సదా సిదాగా మండల సభ

సదా సిదాగా మండల సభ

ముద్ర, జఫర్ గడ్: మండల సర్వసభ్య సమావేశం బుధవారం సాదాసీదాగా జరిగింది. జనగామ జిల్లా జఫర్గడ్ మండల పరిషత్ కార్యాలయం లోని సమావేశ హాలులో నిర్వహించిన సమావేశానికి ఎంపీపీ రడపాక సుదర్శన్ అధ్యక్షత వహించారు ఇటీవల మృతి చెందిన మాజీ ఎంపీటీసీ ఎండి నసీరుద్దీన్ కు సభ్యులు నివాళులర్పించారు.

అనంతరం ఈ సమావేశంలో జాతీయ ఉపాధి పథకం, ఆరోగ్యశాఖ, వ్యవసాయ శాఖలతోపాటు వివిధ శాఖలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీపీ రడపాక సుదర్శన్ మాట్లాడుతూ అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేస్తూ మండల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. స్థానిక ఎస్సై మహేందర్ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, శాంతియుతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలన్నారు .కార్యక్రమంలో జడ్పిటిసి ఇల్లందుల బేబీ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ కోడారి కనకయ్య తహసిల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో శ్రీధర్ స్వామి, ఎస్ ఐ మహేందర్, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.