లాభాల్లో ముగిసిన మార్కెట్ సూచీలు.. 17,150 ఎగువకు నిఫ్టీ
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ముగిశాయి. వరుసగా రెండోరోజూ మార్కెట్లు లాభాలను నిలబెట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య ట్రేడింగ్ను సానుకూలంగా ప్రారంభించిన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. అయితే, ఈరోజు రాత్రి వడ్డీరేట్ల పెంపుపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక ప్రకటన చేయనుంది. ఈ నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఐరోపా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. యూఎస్ ఫ్యూచర్స్ నష్టాల్లోకి దిగజారాయి.