బీఆర్ఎస్ గెలవాలి.. సంక్షేమం కొనసాగాలి..

బీఆర్ఎస్ గెలవాలి.. సంక్షేమం కొనసాగాలి..
  • స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:తెలంగాణలో బీఆర్ఎస్ గెలవాలి.. సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గురువారం నామినేషన్ వేసిన సందర్భాన్ని పురస్కరించుకొని జయశంకర్ విగ్రహం ఆవరణలో జరిగిన కార్నర్ మీటింగ్ లో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణలో అంచెలంచెలుగా అభివృద్ధి సాధించారని అన్నారు. అనేక మంది పేదలకు సంక్షేమ పథకాలు అందించారన్నారు. భూపాలపల్లి అభివృద్ధి చెందాలంటే, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య, జడ్పీ చైర్మన్లు గండ్ర జ్యోతి, జక్కు శ్రీహర్షిణి, మున్సిపల్ చైర్మన్ వెంకటరాణి సిద్దు, గ్రంథాలయ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్, నాయకులు కటకం జనార్ధన్, రాజు తదితరులు పాల్గొన్నారు.