బాలికా విద్య కు మరింత తోడ్పాటు: మంత్రి ఐ కే రెడ్డి

బాలికా విద్య కు మరింత తోడ్పాటు: మంత్రి ఐ కే రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: బాలిక విద్యకు మరింత తోడ్పాటు అందించి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్న ఘనత తమ ప్రభుత్వాని దేనని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని సోఫీ నగర్ కేజీబీవీలో ఎంసెట్ క్రాష్ కోర్సును ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలు బాలురతో సమానంగా పోటీపడుతూ రాణిస్తున్నారని, ఇది హర్షించదగిన పరిణామమని అన్నారు. వారిని మరింత ప్రోత్సహించాలన్న ఆలోచనలో  భాగంగానే కేజీబీవీ విద్యార్థులకు ఎంసెట్ క్రాష్  కోర్సులో శిక్షణ ఇవ్వబడుతుందని వివరించారు. ఇది వారికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి, భారతీయ రాష్ట్ర సమితి నాయకుడు రామ్ కిషన్ రెడ్డి, ధర్మాజీ గారి రాజేందర్, చిలుక రమణ, జిల్లా పరీక్షల సహాయ అధికారి సిద్ధపద్మ తదితరులు పాల్గొన్నారు.