భైంసా లో ఆర్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో పథ సంచాలన్

భైంసా లో ఆర్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో పథ సంచాలన్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా భైంసా లో ఆదివారం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో పథ సంచాలన్ నిర్వహించారు. పట్టణంలోని ఫూలే నగర్ లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమం భగత్ సింగ్ చౌక్, కుబీర్ క్రాస్ రోడ్, ఐ బి చౌక్, శివాజీ చౌక్ ల మీదుగా కొనసాగింది. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు కేవలం 500 కార్యకర్తలు మాత్రమే పాల్గొన్నారు. పోలీస్ అధికారులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు.