చక్రస్నానంతో....  ముగిసిన బ్రహ్మోత్సవాలు 

చక్రస్నానంతో....  ముగిసిన బ్రహ్మోత్సవాలు 

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలో పాల్గొన శుద్ధ సప్తమి ఆదివారం నుండి పాల్గన శుద్ధ త్రయోదశి ఆదివారం వరకు  జరిగిన శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నేటి చక్రస్నానంతో ముగిశాయి. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య, సర్పంచ్ ఉద్యమారి రాజ్ కుమార్, ఆకుల కుమార్, మాలోత్ రమేష్ నాయక్, పోలేపల్లి రంజిత్ కుమార్, శ్యాం కుమార్, గట్టయ్య, రంగు రమేష్, రంగు హరీష్, గట్టెష్ తదితరులు పాల్గొన్నారు.

స్థానిక పూజారులు సౌమిత్రి రంగాచార్యులు, రవీంద్ర శర్మ, అరుణ్ స్వామి, పవన్ స్వామి, గట్టు తెల్ల రంగాచార్యులు, కేశవాచార్యులు, శ్రీనివాసచార్యులు ఉత్సవమూర్తులకు చక్రస్నానం చేయించారు. అనంతరం హోమం, పుష్యయాగం, తిరువీధిసేవ, ధ్వజారోహణ, కంకణోధ్వాసన, మహా పూర్ణాహుతి, పండిత సత్కారంతో శ్రీ గూగుల్ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి.