పార్టీ మార్పుపై కార్యకర్తలదే తుది నిర్ణయం: డా. నాగం జనార్ధన్ రెడ్డి

పార్టీ మార్పుపై కార్యకర్తలదే తుది నిర్ణయం: డా. నాగం జనార్ధన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: ఇతర పార్టీలో చేరడంపై కార్యకర్తల అభీష్టం మేరకే నడుచుకుంటానని.. మాజీ మంత్రి డా. నాగం జనార్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. నాగర్ కర్నూల్‌లో ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి.. పార్టీ ఔన్నత్యాన్ని పెంచిన తనకే టికెట్ ఇవ్వకపోవడం బాధాకరమని చెప్పారు. తనకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. బోగస్ సర్వేల పేరుతో మోసం చేసి రాష్ట్రంలో పార్టీని నాశనం చేశారని మండిపడ్డారు. పార్టీలో కష్టపడి పనిచేసిన సీనియర్లకు తగిన గౌరవం దక్కడం లేదని.. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన రెండో లిస్టులో ఈ విషయం స్పష్టమైందని తెలిపారు. తనతో చర్చించడానికి ఇతర పార్టీల నేతలు వస్తే కాదనబోనని నాగం వెల్లడించారు. ఇప్పటికే తన కార్యకర్తలు వారి అభిప్రాయాలు వెల్లడించారని.. వారి అభీష్టానికి అనుగుణంగా నడుచుకుంటానని చెప్పారు.