మూగ చెవిటి మైనర్ బాలికపై అత్యాచారయత్నం..
![మూగ చెవిటి మైనర్ బాలికపై అత్యాచారయత్నం..](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_643faa2a725f4.jpg)
నాగర్ కర్నూల్ ముద్ర ప్రతినిధి : మూగ చెవిటి మైనర్ బాలికపై గుర్తు తెలియని ఇద్దరు దుండగులు సామూహిక అత్యాచారానికి ప్రయత్నించారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎర్రగడ్డ కాలనీలో బుధవారం తెల్లవారుజామున 2:30 నిమిషాల ప్రాంతంలో చోటు చేసుకుంది.. బాధితురాలు తల్లిదండ్రుల కథనం మేరకు నాగర్ కర్నూలు జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన కుటుంబం పుట్టకోటి కోసం నాగర్ కర్నూల్ లో నివాసం ఉంటున్నారు. మైనర్ బాలిక కు బాత్రూం రావడంతో ఇంటి వెనక్కు వెళ్లగా అటుగా వెళుతున్న దుండగులు ఆ అమ్మాయిని బైక్ పై ఎక్కించుకొని ఎర్రగడ్డ కాలనీలో పాతబడ్డ హాస్టల్ లోకి తీసుకెళ్లి భయభ్రాంతుల గురిచేసి అత్యాచారానికి ప్రయత్నించారు అని మైనర్ బాలిక తండ్రి తండ్రులకు చెప్పినట్టు సమాచారం.. ఆ ఇద్దరి దుండగులతో పాటు ఒక ఆడమనిషి ఉండడం విశేషం.. తండ్రి అర్థరాత్రి లేచి చూసేసరికి పక్కన ఉండే తన కూతురు లేకపోవడంతో వెతుకుతూ వేఉన్నాడు పాత పడ్డ హాస్టల్ నుండి పరిగెత్తుకుంటూ వచ్చిందని తండ్రి సైకిలతో కూతురిని ఇక్కడికి ఎలా వచ్చావు అని అడగ్గా మైనర్ బాలిక తన సైకిల్ తో చెప్పడంతో అక్కడికి వెళ్లి తండ్రితో పాటు మైనర్ బాలిక హాస్టల్ కి వెళ్లి చూడగా అక్కడ ఉన్న దుండగులు ఇద్దరు పరారయ్యారని తండ్రి అంటున్నారు. బాలిక తండ్రి 100 కి ఫోన్ చేసి ఇలా జరిగిన సన్నివేశాన్ని చెప్పారు రాత్రి వచ్చిన పోలీసులు సీసీ కెమెరాలు ఫుటేజ్ లను పరిశీలిస్తూ ఫుటేజ్ లో సరిగ్గా వివరాలు తెలియకపోవడంతో ఎంక్వైరీ చేస్తున్నారు.. మైనర్ బాలిక మూగ చవిటి కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మైనర్ బాలిక తండ్రి తల్లి ఈ మధ్యనే గొడవల కారణంగా ఇలా జరిగిందేమో భయపట్టించడానికి ఇలా చేశారేమో అని పోలీసులు ఎంక్వయిరీ చేస్తున్నారు