మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వెల్లడి.

మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వెల్లడి.
  • దుబ్బాక నియోజకవర్గం పై సీఎం కెసిఆర్ కు  అపారమైన ప్రేమ 
  • నేను కెసిఆర్ మనిషిగా వచ్చాను..నన్ను ఆదరించండి..
  • ఇందుప్రియలో దౌల్తాబాద్ మండల బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం
  • హాజరైన 11 గ్రామాల పార్టీ శ్రేణులు

సిద్దిపేట : ముద్ర ప్రతినిధి దుబ్బాక శాసనసభ నియోజకవర్గం అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు కు అపారమైన ప్రేమ ఉందని, ఇక్కడి ప్రజలందరితో ఆత్మీయ, అనుబంధాలు ఉన్నాయని  మెదక్ పార్లమెంటు సభ్యుడు, సిద్దిపేట జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొత్త ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు.సీఎం మనిషిగానే నేను మీ ముందుకు వచ్చాను.  నన్ను మీరంతా ఆదరించాలని ఆయన కోరారు. రఘునందన్ రావు చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మవద్దని, తాను కేంద్రం నుంచి తెచ్చి చేసిన అభివృద్ధి పనులను తనే తెచ్చానని ఎమ్మెల్యే చెప్పుకోవడం ప్రజల్ని మభ్యపెట్టడానికేనని ఎంపీ చెప్పారు. దుబ్బాక నియోజకవర్గం నుంచి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని 11 గ్రామాల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం గురువారం సాయంత్రం ఇందుప్రియల్ గ్రామంలో నిర్వహించారు ముందుగా గ్రామంలోని అంబెడ్కర్ విగ్రహానికి ఎంపీ పూలమాల వేసి నివాళులర్పించారు మహిళలు బోనాలతో బతుకమ్మలతో ఎంపీ కి స్వాగతం పలుకుగా యాదవ కులస్తులు గొంగడి గొర్రె పిల్లలతో సన్మానించారు పోతరాజులు ఇతరత్రా అనేక రకాల వేషాలతో ఆత్మీయ సమ్మేళనానికి తోడుకొని వెళ్లారు. ఈ సమ్మేళనంలో సిద్దిపేట జిల్లా ఆత్మీయ సమ్మేళనం ఇంచార్జ్ బోడ కుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి 
ఈ సందర్భంగా తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమ సమయంలో అమరుడైన దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి గ్రామ యువకుడు ప్రమోద్ గారి తల్లి తండ్రిని సన్మానించారు.