పన్ను చెల్లించని పరిశ్రమలకు నోటీసులు

పన్ను చెల్లించని పరిశ్రమలకు నోటీసులు

తూప్రాన్, ముద్ర: గత మూడు సంవత్సరాలుగా పన్ను చెల్లించకుండా  ప్రభుత్వ ఆదేశాలను దీక్కరిస్తు ఇష్టానుసారంగ వ్యవహరిస్తున్న ముప్పిరెడ్డిపల్లి పరిశ్రామిక వాడకి చెందిన  పలు పరిశ్రమలకు శుక్రవారం డిఎల్పిఓ శ్రీనివాస్, ఎంపీఓ లక్ష్మి నర్సింలు అధ్వర్యంలో నోటీసులు అందజేశారు. పన్ను చెల్లించని విద్య ఎలక్ట్రికల్ ప్రైవేట్ లిమిటెడ్, సేఫ్ కూల్ ఆగ్రో,(గుబ్బ కూల్ స్టోరేజ్) జాతీయ రహదారిపై ఉన్న న్యూ పంజాబీ దాబాలకు  జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశాల మేరకు పరిశ్రమ యజమానులను కలిసి సకాలంలో పన్నులు చెల్లించాలని సూచించారు. నిర్లక్షం వహిస్తున్న పరిశ్రమలపై  కలెక్టర్ కు నివేదిక పంపి చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు