ఎమ్మెల్యే ఆదేశాలతో ప్రమాదాల నివారణ కోసం చర్యలు తీసుకున్న అధికారులు...

ఎమ్మెల్యే ఆదేశాలతో ప్రమాదాల నివారణ కోసం చర్యలు తీసుకున్న అధికారులు...

తుర్కపల్లి (ముద్ర న్యూస్):యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని ములకలపల్లి సంగ్య తండా గ్రామాల మధ్యలో గల కెనాల్ వద్ద ప్రమాదకరంగా ఉన్న మూలమలుపును మంగళవారం నాడు ప్రభుత్వ విప్ మరియు ఆలేరు శాసనసభ సభ్యులు అయిలయ్య పరిశీలించి, ప్రయాణికులకు ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడంతో అప్రమత్తం అయిన అధికారులు బుధవారం నాడు ప్రమాదకరంగా ఉన్న మూలమలుపు సమీపంలో వైట్ స్పీడ్ బ్రేకర్లను (పిల్ల స్పీడు బ్రేకర్లు), భారీ గేట్స్, రేడియం స్టిక్కర్లను ఏర్పాటు చేశారు, ఈ సందర్భంగా రహదారి వెంట ప్రయాణించే ప్రయాణికులు, సమీప గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ప్రమాదాల నివారణ కోసం ఎమ్మెల్యే తీసుకున్న చర్యలను కొనియాడారు.