హైదరాబాద్ లోని TSPSC ఆఫీస్ వద్ద 'పారామెడికల్' అభ్యర్థులు ఆందోళన

ముద్ర,హైదరాబాద్:- పారామెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ పరీక్ష ఫలితాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లోని TSPSC ఆఫీస్ వద్ద 'పారామెడికల్' అభ్యర్థులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ఉద్యోగాల కోసం పరీక్ష రాసి ఐదేళ్లు గడుస్తున్నా ఫలితాలు విడుదల చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో పర్యాయాలు ప్రభుత్వం, TSPSC అధికారుల చుట్టూ తిరిగి బతిమిలాడినా పట్టించుకోవడం లేదనని ఆవేదన చెందుతున్నారు.