దోమలగూడ రోజ్ కాలనీలో అగ్నిప్రమాదం 

దోమలగూడ రోజ్ కాలనీలో అగ్నిప్రమాదం 

ముద్ర, ముషీరాబాద్: దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోజ్ కాలనీలో గ్యాస్ లీక్ అయి అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానిక బస్తీవాసులు భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలిపోయి బూడిద అయ్యాయి. గాయాలకు గురైన వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న దోమలగూడ పోలీసులు విచారణ జరుపుతున్నామని తెలిపారు. స్థానిక కార్పొరేటర్ రచనశ్రీ, బిజెపి నాయకులు సంఘటన స్థలాన్ని సందర్శించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు