కెసిఆర్ సభకు భారీగా తరలిన పార్టీ శ్రేణులు

కెసిఆర్ సభకు భారీగా తరలిన పార్టీ శ్రేణులు

ముద్ర / రాజపేట: ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న టిఆర్ఎస్ భారీ బహిరంగ సభకు మంగళవారం రాజపేట మండలంలోని వివిధ గ్రామాల పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు.ప్రత్యేక వాహనాలలో ఉత్సాహంగా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో రాజపేట మండల పార్టీ అధ్యక్షులు కంచర్ల శ్రీనివాస్ రెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ మోత్కూపల్లి జ్యోతి ప్రవీణ్ కుమార్,జాల మాజీ సర్పంచ్ గుంటి మధుసూదన్ రెడ్డి,మండల పార్టీ సెక్రటరీ జనరల్ సందిల భాస్కర్ గౌడ్,మాజీ ప్రజా ప్రతినిధుల ఫోరం మండల శాఖ అధ్యక్షులు బొంగోని ఉప్పలయ్య,యువజన విభాగం మండల శాఖ అధ్యక్షులు పల్లె సంతోష్ కుమార్ గౌడ్,కటకం స్వామి,ఎర్ర గోకుల జస్వంత్,పిఎసిఎస్ చైర్మన్ చింతలపూరి భాస్కర్ రెడ్డి,రామచంద్రారెడ్డి,యువకులు తదితరులు పాల్గొన్నారు.