జగిత్యాల క్లబ్  కార్యదర్శిగా పుప్పాల అశోక్ 

జగిత్యాల క్లబ్  కార్యదర్శిగా పుప్పాల అశోక్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల :జగిత్యాల క్లబ్ కార్యదర్శిగా న్యాయవాది,మాజీ కౌన్సిలర్ పుప్పాల అశోక్ ఘనవిజయం సాధించారు. జగిత్యాల క్లబ్ లో ఆదివారం  కార్యదర్శి పదవికి జరిగిన పోలింగులో 368 మంది సభ్యులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. కార్యదర్శి పదవికి నలుగురు మాజీ కౌన్సిలర్లు పుప్పాల అశోక్, పులిరాము, ఏ సి ఎస్ రాజు, కైరి భూమాగౌడ్ లు పోటీ పడగా 53 ఓట్ల తేడాతో అశోక్ గెలుపొందారు. 
అశోక్ కు149 ఓట్లు రాముకు 96 ఓట్లు , రాజుకు 68 , భూమగౌడ్ కు51 ఓట్లు వచ్చాయి. మిగతా అన్నిపదవులు కూడా ఏకగ్రీవమయ్యాయి.
సంయుక్త కార్యదర్శిగా కచ్చు హరీష్, కోశాధికారి అలగొండ రాధా కిషన్, స్పోర్ట్స్ కార్యదర్శిగా ప్రసాద్ రావు బోయిన్ పల్లి,సభ్యులుగా కూసరి అనిల్,చేపురి లక్ష్మణ్ గౌడ్, కడార్ల చంద్ర శేఖర్, కాశారపు లక్ష్మీనారాయణ, కొక్కుల రమేష్, కె. రమణ, టి. సాయికృష్ణ, టి. రఘులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికైన వారిని పలువురు అభినందించారు.