తుఫాను వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

తుఫాను వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
  • ప్రయాణం సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
  •  అత్యవసర సమయంలో 100 కు ఫోన్ చేసి సహాయం పొందాలి.
  •  రాహుల్ హెగ్డే ఎస్పీ సూర్యాపేట

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-తుఫాను ప్రభావం వల్ల కురుస్తున్న వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు, రైతులు, వాహనదారులు, ప్రయాణికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి, ప్రమాదాలకు దూరంగా ఉండాలి అని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే విజ్ఞప్తి చేసినారు. ఈ మేరుకు సూర్యాపేట జిల్లా పోలీసు   అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశాము అని అన్నారు. అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించి సేవలు అందించాలని సిబ్బందిని అదేశించడం జరిగినదని ,ఏదైనా అత్యవసరమైతే స్థానిక పోలీసులకు, డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసు సేవలను పొందవచ్చు అని తెలిపినారు.

అధిక వర్షాల దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

శిథిలావస్థకు వచ్చిన నివాసలలో ఉండవద్దని,చేపల వేటకు వెల్లవొద్దని,చెరువులు, వాగులు నిండుగా ఉన్నాయి కావున వాటి వద్దకు వెళ్ళవద్దన్నారు.వాతావరణ తడిగా ఉన్నందున కరెంట్ స్థంబాల వద్దకు వెళ్ళవద్దని, సాధారణ ప్రజలు కరెంట్ రిపేర్ పనులు చేయవద్దని,వర్షం ప్రభావంతో చలి తీవ్రత ఉన్నందున పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ప్రయాణ సమయంలో వాహనదారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, రోడ్లపై వర్షం నీరు చేరడం వల్ల వాహనాలు అదుపుతప్పి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని , వాహనాలు వేగంగా నడపవద్దని, వర్షం పడే సమయంలో ప్రయాణాలు చేయకుండా వీలైతే వాయిదా వేసుకోవాలన్నారు.జాతీయ రహదారి (NH65) పై వాహనదారులు నెమ్మదిగా వెళ్ళాలని,వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తగా ఉండాలని,పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని ఎస్పీ సూచించారు