జగిత్యాలలో ఘనంగా రంజాన్ వేడుకలు 

జగిత్యాలలో ఘనంగా రంజాన్ వేడుకలు 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా  పట్టణంలోని ఈద్గా, ఖిలా, జామా మసీద్ లలో ముస్లింలు ప్రత్యేక ప్రార్ధనలు జరిపారు. అలాగే  జగిత్యాల సబ్ జైల్లో రంజాన్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామబాద్ కాంగ్రెస్ పార్టి ఎంపి అభ్యర్థి  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ లు ముస్లింమైనారిటీలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమాలలో ముస్లిం సెంట్రల్ కమిటి అధ్యక్షుడు అబ్దుల్ భారి, ఈద్గా కమిటి అధ్యక్షుడు జమీల్ హైమాద్, ఖిలా కమిటి అధ్యక్షుడు యున్నిస్ నదీం, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సిరజోద్ధిన్ మన్సూర్ తదితరులు పాల్గొన్నారు.