సిద్దిపేటలో యధావిధిగా పొడి చెత్త  సేకరణ

సిద్దిపేటలో యధావిధిగా పొడి చెత్త  సేకరణ

మున్సిపాలిటీ నుంచి కొనుగోలు చేసిన ఎర్త్ బాక్స్ కంపెనీ

సిద్దిపేట: ముద్ర  ప్రతి నిధి: భారీ అగ్ని ప్రమాదంతో డిఆర్సిసి బుగ్గిపాలైనప్పటికీ ఎర్త్ బాక్స్ కంపెనీ మంగళవారం పొడి చెత్తను సిద్దిపేట మున్సిపాలిటీ నుంచి యధావిధిగా కొనుగోలు చేసింది. ఎప్పటి మాదిరిగానే మంగళవారం నాడు సిద్దిపేట పట్టణంలో 43 వాహనాల ద్వారా పొడి చెత్తను గృహ యజమానుల నుండి మునిసిపల్ సిబ్బంది సేకరించారు. అనంతరం దానిని డి ఆర్ సి సి లో ఎర్త్ బాక్స్ కంపెనీకి అందజేశారు.

సిద్దిపేటలో మంగళ, శుక్రవారం మాత్రమే పొడి చెత్తను సేకరిస్తారు. గత శుక్రవారం నాడు పొడిచెత్తను సేకరించి ఎర్త్ బాక్స్ కంపెనీకి అందజేశారు. దాన్ని  వారు రీసైకిల్ చేస్తున్న క్రమంలో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగి డీఆర్సీసీలో ఆ కంపెనీ యంత్రాలన్నీ దగ్ధమైన విషయం తెలిసిందే.