మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

ముద్ర మేళ్ళచెరువు: మండల పరిషత్ కార్యాలయం నందు మేళ్లచెరువు మండలం ఎంపీపీ శ్రీ కొట్టే పద్మ సైదేశ్వరరావు అధ్యక్షతన జనరల్‌ బాడీ సమీక్ష సమావేశం మంగళవారం జరిగింది ఈ సందర్భంగా (రెవెన్యూ వైద్య ఆరోగ్య విద్యాశాఖ పంచాయతీ రాజ్ శిశు సంక్షేమ శాఖ)మరియు వివిధ శాఖలపై ఆయా గ్రామాలకు సంభందించిన అభివృద్ధి కార్యక్రమాలను మండల అధికారులు చదివి వినిపించారు.

వివిధ సమస్యలపై ఈ సమావేశంలో తీర్మానాలు చేశారు.ఈనెల ఒకటవ తేదీ నుండి ఇరవై వరకు తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించనున్న ఆవిర్బావ వేడుకలు విజయవంతం చెయ్యాలని కోరారు ఈ కార్యక్రమం లో జడ్పిటిసి పద్మ గోవింద రెడ్డి, వైస్ ఎంపీపీ గాయం గోపిరెడ్డి, ఎంపీడీవో ఇసాక్ హుస్సేన్, తాసీల్ధార్ దామోదర్ రావు, అధికారులు సర్పంచ్ లు, ఎంపిటిసిలు  పంచాయతీ కార్యదర్శులు మరియు తదితరులు పాల్గొన్నారు.