గృహాలు తొలగించి రోడ్డు వేడెల్పుకు సహకరించండి.
- మున్సిపల్ కమిషనర్ సీ శ్రీకాంత్
మోత్కూర్,ముద్ర న్యూస్:మోత్కూర్ పురపాలక సంఘము లో మెయిన్ రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా రోడ్డు విస్తరణ పనులకు ఇండ్లు తొలగించని గృహ యజమానులు వెంటనే తొలగించుకోవలేనని మునిసిపల్ కమిషనర్ సి శ్రీకాంత్ అన్నారు.మంగళవారం మెయిన్ రోడ్డు గృహ యజమానులకు సిబ్బందితో కలిసి తెలియచేశారు .వెంటనే నిర్మాణాలు తొలగించుకోవాలనిలేనియెడల మున్సిపాలిటీ వారే తొలగించి, ఇట్టి తొలగింపుకు అగు వ్యయం ను గృహ యజమానుల నుండి వసూలు చేయబడును అని తెలియజేయడం జరిగినది.