కొడంగల్లో బీసీ గురుకుల సంస్థ నిర్మాణానికి రూ.75 కోట్లు మంజూరు
![కొడంగల్లో బీసీ గురుకుల సంస్థ నిర్మాణానికి రూ.75 కోట్లు మంజూరు](https://mudranews.in/uploads/images/2024/05/image_750x_663a05983d928.jpg)
ముద్ర,తెలంగాణ:- ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో గురుకుల విద్యాసంస్థల నిర్మాణాలకు ప్రభుత్వం రూ. 75 కోట్లు కేటాయించింది. ఈ మేరకు బీజీ సంక్షేమశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ గురుకుల జూనియర్ కళాశాలకు రూ. 25 కోట్లు, బీసీ గురుకుల పాఠశాలలకు రూ. 50 కోట్లు మంజూరు చేశారు.