సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులకు   మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ మద్దతు

సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులకు   మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ మద్దతు

ముద్ర ప్రతినిధి కామారెడ్డి:-తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయడంతో పాటు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు చేపట్టిన నిరసనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందనీ మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు స్వరాష్ట్రంలో తమ ఉద్యోగాలు రెగ్యులరైజ్ అవుతాయి అనుకుంటే నిరాశ మిగిలిందని  ఆవేదన వ్యక్తం చేశారు.

సర్వ శిక్ష ఉద్యోగులకు వెంటనే బేసిక్ పే మంజూరు చేస్తూ సర్వీస్ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. సర్వ శిక్ష అభియాన్ లో పని చేస్తున్న మహిళ ఉపాధ్యాయులకు రెగ్యులర్ ఉద్యోగుల్లాగా 180 రోజుల ప్రసూతి సెలవులు ఇతర అన్ని వసతులు కల్పించాలని కోరారు.వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం నని న్యాయమైన డిమాండ్ అన్ని నెరవేరుస్తామని మీరు కాంగ్రెస్ పార్టీ కి  మద్దతు పలికి గెలిపించి మి సమస్యలు నెరవేర్చుకోవాల నీ కోరారు.