ప్రారంభోత్సవ కార్యక్రమంలో కిందపడిపోయిన సీఎం నితీశ్
![ప్రారంభోత్సవ కార్యక్రమంలో కిందపడిపోయిన సీఎం నితీశ్](https://mudranews.in/uploads/images/2023/09/image_750x_64f6e34f866bf.jpg)
ముద్ర, తెలంగాణ బ్యూరో : బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కిందపడిపోయారు. మంగళవారం పాట్నా యూనివర్సిటీలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం నితీశ్ కుమార్ సహా బీహార్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్, పాట్నా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ గిరీస్ కుమార్ చౌదరి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించేందుకు అంతా స్టేజ్పైకి వెళ్లారు. ఆ సమయంలో సీఎం నితీశ్ కుమార్ ఒక్కసారిగా పట్టుకోల్పోయి కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సీఎం నితీశ్ కుమార్ ను పైకి లేపారు. అనంతరం కార్యక్రమాన్ని కొనసాగించారు.