కొండగట్టు క్రింద దొంగల హల్చల్

కొండగట్టు క్రింద దొంగల హల్చల్

తెల్లవారుజామున ఎల్లమ్మ ఆలయంలో చోరీ, ఆటో దొoగతనం..
ముద్ర, మల్యాల: కొండగట్టు గుట్ట క్రింద గురువారం తెల్లవారుజామున దొంగలు హల్చల్ చేశారు. ఎస్ ఐ చిరంజీవి కథనం మేరకు... స్థానిక ఎల్లమ్మ ఆలయంలోకి చొరబడ్డ దొంగలు హుండీ పగులగొట్టి అందులోని నగదు, అలాగే మోహన్ అనే కోడిగుడ్ల వ్యాపారికి చెందిన ఆటో ఎత్తుకెళ్లారు. ఆలయ నిర్వాహకులు, ఆటో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, గుట్ట కింద మరొకరి కారు అద్దాలు గుర్తు తెలియని వ్యక్తులు పగులగొట్టినట్లు, ఆటో చోరీ చేస్తున్న దృశ్యం సీసీ పుటేజ్ లో రికార్డ్ అయినట్లు స్థానికులు పేర్కొన్నారు.