రైతుబంధు నిధులు రూ. 550.14 కోట్లు విడుదల

రైతుబంధు నిధులు రూ. 550.14 కోట్లు విడుదల

1,60,643 మంది రైతుల ఖాతాలలో నిధులు జమ

11 లక్షల 306.38 ఎకరాలకు నిధులు విడుదల

ఇప్పటి వరకు మొత్తం 62 లక్షల 45 వేల 700 మంది రైతుల ఖాతాలలో రూ.6351.22 కోట్లు జమ

ఖమ్మం బీఆర్ఎస్ బహిరంగసభ నవశకానికి నాంది పలకబోతున్నది

దేశ రాజకీయ చరిత్రలో ఒక మలుపురాయిలా నిలవనున్నది

ఖమ్మం సభలో కేసీఆర్ సందేశం చారిత్రాత్మకం కానున్నది

నాడు తెలంగాణ కోసం
నేడు దేశం కోసం కేసీఆర్ ముందడుగు వేశారు

తెలంగాణ మాదిరిగానే దేశం సస్యశ్యామలం కావాలి

60 శాతం జనాభా ఆధారపడిన వ్యవసాయ రంగం సుభిక్షంగా వర్దిల్లాలి

అన్ని రంగాలను అమ్మేసినా కేంద్రం కన్ను ఆహారరంగం మీద పడింది

కేసీఆర్ నాయకత్వంలో కేంద్రం కుట్రలను చేధిస్తాం

తెలంగాణ వ్యవసాయ పథకాలు, సంక్షేమ పథకాలు దేశమంతా అమలుకావాలని భారత ప్రజలు ఆశిస్తున్నారు

బీఆర్ఎస్ అడుగులు చూసి బీజేపీలో వణుకు పుడుతున్నది

అందుకే తెలంగాణ మీద కక్ష్యగట్టి నిధులు రాకుండా, రుణాలు అందకుండా అడ్డుపుల్లలు వేస్తున్నది

బీజేపీకి ప్రజలే సమాధానం చెబుతారు

మీడియాకు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో  రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు