రాష్ట్ర స్థాయి సావిత్రి భాయి పూలే అవార్డ్ మహిళా సేవ విభాగంలో    కల్వచర్ల కు చెందిన ప్రకృతి వైద్య నిపుణురాలు డాక్టర్ శరణ్య  ఎంపిక

రాష్ట్ర స్థాయి సావిత్రి భాయి పూలే అవార్డ్ మహిళా సేవ విభాగంలో    కల్వచర్ల కు చెందిన ప్రకృతి వైద్య నిపుణురాలు డాక్టర్ శరణ్య  ఎంపిక

ముద్ర రామగిరి: బీసీ సంక్షేమ సంఘం అధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి సావిత్రి భాయి పూలే అవార్డ్ మహిళా సేవ విభాగంలో  రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన ప్రకృతి వైద్య నిపుణురాలు డాక్టర్ శరణ్య  ఎంపిక  అయ్యారు. ఈ అవార్డ్ ను జనవరి 3వ తేదీన హైదరాబాద్ లోనీ రవీంద్ర భారతి లో డాక్టర్ శరణ్య  కు అందచేయనున్నారు.ఈ అవార్డ్ కల్వచర్ల గ్రామానికి చెందిన డాక్టర్ శరణ్య కు రావడం చాలా సంతోషమని, రాబోయే రోజుల్లో మరింత ఉన్నత స్థాయి కి శరణ్య ఎదగాలని కల్వచర్ల గ్రామానికి మంచి పేరు తీసుకురావడం పై గ్రామ సర్పంచ్ గంట పద్మా వెంకటరమణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.