ప్రజలకు అందుబాటులో ఉండాలి - నిర్మల్ ఎస్పి జానకి షర్మిల

ప్రజలకు అందుబాటులో ఉండాలి - నిర్మల్ ఎస్పి జానకి షర్మిల

ముద్ర ప్రతినిధి, నిర్మల్: పోలీసు శాఖ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్మల్ ఎస్పి జానకి షర్మిల సూచించారు. సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల విభాగానికి ఆమె హాజరై ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాణ్యమైన పోలీసు వ్యవస్థను జిల్లా ప్రజలకు అందించి పోలీసుల గౌరవం మరింత పెంచే విధంగా కృషిచేయాలని అన్నారు. శాంతి భద్రతలను విఘాతం కల్గించే వారిపట్ల కఠినంగా చట్టరీత్యా చర్యలుంటాయని సూచించారు. పోలీసుల సహాయం కావాలనుకున్నా వారు పోలీసు స్టేషన్ లో నిర్భయంగా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనబడినా, సంఘ వ్యతిరేక చర్యలు జరుగుతున్నాయని దృష్టికి వచ్చినా వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు సమాచారం అందించాలని కోరారు.