కడెం ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్యే రేఖా నాయక్, కలెక్టర్

కడెం ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్యే రేఖా నాయక్, కలెక్టర్

ఖానాపూర్, ముద్ర 21 : కడెం  ప్రాజెక్టుకు శుక్రవారం భారీ వరద రావడంతో  ఎమ్మేల్యే అజ్మీరా రేఖానాయక్, నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి లు అక్కడికి వెళ్లి ప్రాజెక్టు పరిస్థితి ని చూసారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వరద నీరు అధికంగా ఉన్నందున ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ప్రాజెక్టు దిగువన ఉన్నవారు, లోతట్టు ప్రాంతాలలో గోదావరి నది వైపు వెళ్లకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ప్రతినిధులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశిస్తూ ముప్పు గ్రామాల్లో ప్రజలను అలర్ట్ చేయాలని సూచించారు. 14 గేట్ల ద్వారా నీటిని వదలడం జరిగిందని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ధైర్యంగా ఉండాలని, ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, తాను ఇక్కడే అందుబాటులో ఉంటానన్నారు. ఎమ్మెల్యే  వెంట ప్రజాప్రతినిధులున్నారు.