కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన సింగరేణి...

కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన సింగరేణి...
  • ఇక నుంచి వారికి రూ. కోటి ఇన్సూరెన్స్...!

ముద్ర ప్రతిదీ పెద్దపల్లి: సింగరేణి ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త... సింగరేణి యాజమాన్యం తెలిపింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సింగరేణి కీలక ఒప్పందం చేసుకుంది. దీంతో ఉద్యోగులకు ఇక నుంచి రూ.కోటి ఇన్సూరెన్స్ అందించనుంది.

సిరులు కురిపించే సింగరేణి ఉద్యోగులకు వరాలు కురిపిస్తోంది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రభుత్వాధీనంలో నడిచే సంస్థ అ సంస్థలో పనిచేసే ఉద్యోగుల సంక్షేమానికి సింగరేణి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంటుంది. ఉద్యోగుల భవిష్యత్ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటూ... సింగరేణిలో పనిచేసే ఉద్యోగులకు, కార్మికులకు, సిబ్బందికి అధిక బోనస్ లు ప్రకటిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో సింగరేణి సంస్థ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఇక నుంచి వారికి కోటి రూపాయల ఇన్సూరెన్స్ అందనున్నాయి. దీనికి సంబంధించి సింగరేణి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కీలక ఒప్పందం చేసుకుంది.