ఐటీ మంత్రి శ్రీధర్ బాబుకు శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ మంజూర్, డాక్టర్ ఎండి మోయిన్ పాషా
ముద్ర రామగిరి: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి స్విట్జర్లాండ్ లోని దావోస్ పర్యటన, దుబాయ్ లోని జెడ్డా తదితర దేశాల పర్యటనలో పాల్గొని దాదాపు 200 విదేశీ కంపెనీల ప్రతినిధులతో వ్యాపార వాణిజ్యం ఎం ఓ యు లు కుదుర్చుకొని సుమారు రూ. 40వేల కోట్ల పెట్టుబడులను ఆహ్వానించి, విజయవంతంగా విదేశీ పర్యటన ముగించుకొని మంగళవారం హైదరాబాద్ కు విచ్చేసిన సందర్భంగా రాష్ట్ర ఐటీ,వాణిజ్యం, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ను హైదరాబద్ సచివాలయం లో రామగిరి మండలంలోని లొంక కేసారం సర్పంచ్ ఎండి మంజూర్, డాక్టర్ ఎండి మోయిన్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి, శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందించారు.