కేటీఆర్ ను అడ్డుకుంటాం

కేటీఆర్ ను అడ్డుకుంటాం
  • 24 గంటల నీళ్లు ఏమైనయ్
  • నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :ఇరవై నాలుగు గంటలు నల్లా నీళ్ళు ఇస్తామని చెప్పి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శిలాఫలకం శంఖుస్థాపన చేసి సంవత్సరం దాటినా ఇప్పటికి అతీగతీ లేదన నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో అలుగునూరు బ్రిడ్జి పైన పైలాన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి గంగుల కమలాకర్ పది సంవత్సరాలుగా ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ఇస్తామని నగర ప్రజలను మభ్యపెడుతున్నాడని విమర్శించారు. గత ఏడాది మార్చి నెలలో అట్టహాసంగా మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా  శంఖుస్థాపన చేయడం జరిగిందన్నారు. 24 గంటల నీళ్లు దేవుడెరుగు కనీసం రోజూ ఒకసారి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి వస్తున్న మంత్రి కేటీఆర్ 24 గంటల నీళ్లపై కరీంనగర్ ప్రజలకు సమాధానం చెప్పాలని నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై స్పందించక పోతే ఏదో ఒక ప్రాంతంలో మంత్రి కేటీఆర్ ను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రవణ్ నాయక్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి,చర్ల పద్మ,కుర్ర పోచయ్య,చంద్రయ్య గౌడ్,దన్న సింగ్,ముక్క భాస్కర్, ఎండి చాంద్, షబానా మహమ్మద్,దండి రవీందర్, సలీమొద్ధిన్, మెతుకు కాంతయ్య, మామిడి సత్యనారాయణ రెడ్డి, తమ్మడి ఎజ్రా,నాగుల సతీష్, కంకణాల అనిల్ కుమార్, ఊరడి లత, ముల్కల కవిత, నెల్లి నరేష్, మహమ్మద్ భారీ, సిరాజొద్దిన్, కాంపల్లి కీర్తి కుమార్, దామోదర్, శ్రీకర్, హనీఫ్, ఎగ్గడి శారద, అజయ్, దిలీప్, శారద, మహాలక్ష్మి, జిలకర రమేష్, యోనా తదితరులు పాల్గొన్నారు.