భారీ వర్షాలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి కరీంనగర్ సీపీ ఎల్ సుబ్బరాయుడు

భారీ వర్షాలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి కరీంనగర్ సీపీ ఎల్ సుబ్బరాయుడు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా కరీంనగర్ కమిషనరేట్ లోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తగిన జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు అన్నారు. పరివాహక, లోతట్టు ప్రాంతాలకు చెందిన ప్రజలకు సహాయం అందించే కు పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని చెప్పారు. కమీషనరేట్ పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని,అధికారుల సూచనలను పాటిస్తూ పోలీసులకు వారికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాలకు చెందిన ప్రజలను అప్రమత్తం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. చిన్నపిల్లలను బయటికి రానివ్వొద్దని, చెట్ల కింద ఉండకూడదని, విద్యుత్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేశారు.