అర్హులైనందరికీ ఆరు గ్యారంటీ పథకాలు

అర్హులైనందరికీ ఆరు గ్యారంటీ పథకాలు
  • సిద్దిపేట డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి

తూప్రాన్, ముద్ర:- అర్హులైన ప్రజలందరికి ఆరు గ్యారంటీ పథకాలు అందజేస్తామని సిద్దిపేట డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి అన్నారు. బుధవారం తూప్రాన్ మండలంలో పర్యటించి కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసారు. అనంతరం మున్సిపల్ పరిధిలోని వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు నాయకులు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో  నర్సారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.

అనంతరం ఇమాంపూర్ గ్రామం లో ఉప సర్పంచి ల ఫోరమ్ అధ్యక్షుడు బక్క  సత్యనారాయణ గౌడ్ 50 మంది కార్యకర్తలతో  కాంగ్రెస్ పార్టీ లో చేరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న అరు పథకాలను అర్హులైన అందరికీ అందేలా చూస్తామని అన్నారు ఈ గత ప్రభుత్వంలో ఎలాంటిఅభివృద్ధికి నోచుకోలేదని,దొరల పాలన సాగిందని, మట్టి మాఫియా రాజ్యమేలిందని, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఆకాశానికి భూమికి మధ్య వ్యత్యాసం ఉండేదని. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమ పాలన కొనసాగుతుందని, బడుగు బలహీన వర్గాలకు నిజమైన నిరుపేదలకు న్యాయం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.