నేతాజీ నగర్ లో వైభవంగా సీతారామ కళ్యాణం

నేతాజీ నగర్ లో వైభవంగా సీతారామ కళ్యాణం

 ముద్ర న్యూ బ్యూరో హైదరాబాద్: శ్రీరామనవమి సందర్భంగా మెహదీపట్నం సమీపంలోని నేతాజీ నగర్ కాలనీలో గల శ్రీ ఉమామహేశ్వర సీతారామ అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామ కళ్యాణం వైభవంగా జరిగింది. కన్నుల పండువగా జరిగిన శ్రీ రామ కళ్యాణాన్ని నేతాజీ నగర్, జ్యోతి నగర్, శ్రీనివాస్ నగర్ మారుతి నగర్ కు చెందిన వందలాది మంది భక్తులు తిలకించారు.

అనంతరం జరిగిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో సుమారు 1500 మంది భక్తులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ నిర్వాహకులు, నేతాజీ నగర్ కాలనీ అసోసియేషన్ నాయకులు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కటి ఏర్పాట్లు చేశారు.